పంజాబ్ రాష్ట్రంలో రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి.ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఆయన రాజీనామా చేసిన కొద్ది రోజులకే… నవజ్యోత్ సింగ్ సిద్ధూ.పీసీసీ అధ్యక్ష పదవికి ఇప్పుడు రాజీనామా చేసి పార్టీ హైకమాండ్ సోనియా గాంధీ కి లెటర్ పంపడం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే తన రాజీనామా లేఖలో సిద్ధూ పంజాబ్ భవిష్యత్.అదే రీతిలో సంక్షేమం విషయంలో రాజీ పడటం ఇష్టం లేక… ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్దు చెప్పుకొచ్చారు.
పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా గాని కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నట్లు తెలిపారు.సోనియాకి పంపిన లెటర్ ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు పదవులకు రాజీనామాలు చేయడం ఆ పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది.ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్ జిత్ సింగ్.
సిద్దూకి అత్యంత సన్నిహితుడని, ఆయన వెనకాల నుండి.సిద్ధి చక్రం తిప్పుతున్న ట్లు పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వార్తలు వస్తున్నాయి.
మరోపక్క కాంగ్రెస్ పార్టీతో పాటు పోటీ పడటానికి ఆమ్ ఆద్మీ పార్టీ… వ్యూహాలు సిద్ధం చేస్తూ ఉంది.