టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ అయిన జాతిరత్నాలు చిత్రం బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో నవీన్ పోలిశెట్టి టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయాడు.
ఆయన నటించిన తీరు ఈ సినిమాకు హైలైట్ కావడంతో, నవీన్ పోలిశెట్టికి అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది.ఇక ఈ హీరోకు ప్రస్తుతం వరుసబెట్టి ఆఫర్లు వస్తుండటంతో, నవీన్ చేయబోయే సినిమాల గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే స్టార్ బ్యూటీ అనుష్క చేయబోయే సినిమాలో అదిరిపోయే ఆఫర్ కొట్టేశాడు నవీన్ పోలిశెట్టి.కాగా ఈ సినిమాను మహేష్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని సినీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
అయితే ఈ సినిమాతో పాటు మరో లక్కీ ఛాన్స్ను నవీన్ పోలిశెట్టి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఓ బంపర్ ఆఫర్ కొట్టేశాడట ఈ యంగ్ హీరో.తమ నెక్ట్స్ మూవీలో నటించేందుకు ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్తో నవీన్ పోలిశెట్టిని లాక్ చేశారట.
జాతిరత్నాలు కోసం రూ.2.5 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్న నవీన్ పోలిశెట్టిని ఇంత భారీ రేటుకు లాక్ చేస్కోవడంతో ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది.ఒక్క సినిమాతో రెమ్యునరేషన్ను డబుల్ చేసి మరీ లాక్ చేసుకున్న ఈ హీరోకు ఎలాంటి చిత్రం పడుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాను అతి త్వరలో అనౌన్స్ చేసేందుకు సదరు నిర్మాణ సంస్థ రెడీ అవుతోందట.మరి నవీన్ పోలిశెట్టి తనకు వచ్చిన క్రేజ్ను ఎలా ఉపయోగించుకుంటాడో, మున్ముందు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.