జాతిరత్నాలు సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా రెండవ ఆఫర్ కోసం ఎదురు చూస్తుంది.ఇటీవల ఆమెకు రెండవ ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
ఒక యంగ్ హీరో కు జోడీగా ఆమె నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది.దాంతో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
షూటింగ్ కూడా ప్రారంభించలేదు కనుక ఆ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించడం నమ్మకం తక్కువ అంటున్నారు.అంటే హాట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లాకు రెండవ ఆఫర్ ఇంకా దక్కలేదు.
వచ్చే ఏడాది ఈమె సినిమా ఉంటుందని ఆశించిన వారికి నిరాశ తప్పేలా లేదు.జాతి రత్నాలు సినిమా తో హీరోయిన్ గా మంచి గుర్తింపు అయితే దక్కించుకుంది కాని ఈమెకు పర్సనాలిటీ ఒక పెద్ద సమస్యగా మారింది.
ఆమె ఎత్తు మరియు ఫిజిక్ వల్ల కొందరు హీరోలు ఆమె పక్కన చాలా తక్కువగా కనిపిస్తారు.అందుకే ఆమెకు సెకండ్ ఆఫర్ ఆలస్యం అవుతుంది.
ఫరియాకు రెండవ సినిమా కూడా జాతి రత్నాలు అయ్యేలా ఉంది.ఎందుకంటే జాతిరత్నాలు సినిమాను యూఎస్ లో సీక్వెల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆ ముగ్గురు అమెరికా వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది సినిమా కథగా చెప్పబోతున్నారు.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నట్లుగా దర్శకుడు అనుదీప్ పేర్కొన్నాడు.
ఫరియా అబ్దుల్లా సెకండ్ పార్ట్ లో కూడా ఉంటుందని ఇప్పటికే అనుదీప్ క్లారిటీ ఇచ్చాడు.ఆమె పాత్ర ఆమె కోసం ఉంటుందని దర్శకుడు చెప్పడంతో సెకండ్ జాతిరత్నాలు అయినా ఆమెకు టాలీవుడ్ నుండి ఆఫర్లను తెచ్చి పెడుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఫరియా అబ్దుల్లా సినిమా ఆఫర్లతో పాటు వెబ్ సిరీస్ ల్లో ఆఫర్ల కోసం కూడా ఎదురు చూస్తోంది.నటిగా తనను తాను నిరూపించుకునేందుకు గాను ఫరియా వెబ్ సిరీస్ చేస్తానంటూ ఆమద్య చెప్పుకొచ్చింది.
ఆమె లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ చేయబోతుందేమో చూడాలి.