నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.మల్టీ ట్యాలెంటెడ్ అనే పేరుకు నిలువెత్తు నిదర్శణం అన్నట్లుగా ఉండే నవీన్ నిన్న జాతి రత్నాలు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా కు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.ఈ సినిమా ను అన్ని ఖర్చులు కలిపి అయిదు కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి చేశారంటూ వార్తలు వచ్చాయి.
కాని సినిమా రేంజ్ చూస్తుంటే 50 కోట్లకు మించి నిర్మాతలకు లాభాలు దక్కే అవకాశం ఉందంటున్నారు.సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో బడ్జెట్ రికవరీ అయ్యింది.
ఇక ముందు రాబోతున్న వసూళ్లు మరియు ఇతర రైట్స్ ద్వారా వచ్చిన మొత్తం అన్ని కూడా లాభాలే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3.82 కోట్ల రూపాయలను దక్కించుకుంది.ఇతర రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ లో కలిపితే అయిదు కోట్ల వరకు అయ్యే అవకాశం ఉంది.
ఏరియాల వారిగా ఈ సినిమా షేర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.నైజాం : రూ.1.45 కోట్లు సీడెడ్ః రూ.55 లక్షలు ఉత్తరాంధ్రః రూ.50 లక్షలు గుంటూరుః రూ.39 లక్షలు ఈస్ట్ గోదావరిః రూ.29 లక్షలు వెస్ట్ గోదావరిః రూ.28 లక్షలు కృష్ణః రూ.25 లక్షలు నెల్లూరుః రూ.11 లక్షలు
మొత్తంః రూ.3.82 కోట్లు
ఇటీవల విడుదల అయిన ఉప్పెన సినిమా తో పోల్చితే ఈ సినిమా వసూళ్ల విషయమై ఇంకా బెటర్ గా ఉందని అంటున్నారు.ఇక నిన్న విడుదల అయిన ఇతర సినిమా గాలి సంపత్ గురించి జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
శ్రీకారం సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మంచి వసూళ్లను రాబడుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.