నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా మూడవ వారంలోకి అడుగు పెట్టింది.మొదటి వారంలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండవ వారంలో కూడా మంచి వసూళ్లను రాబట్టి భారీ మొత్తంను రాబట్టిన విషయం తెల్సిందే.
ఇప్పటికే భారీగా వచ్చిన వసూళ్లకు తోడుగా మూడవ వారంలో కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది.ఈమద్య కాలంలో చిన్న సినిమాలు రెండవ వారం రాబట్టిన వసూళ్లను పరిశీలిస్తే భారీ మొత్తంలో ఈ సినిమా రాబట్టింది.
ఇతర సినిమాలతో పోల్చితే ఈ సినిమా రెండవ వారంలో అత్యధిక వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది అంటూ టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా హాట్ టాపిక్ అయ్యింది.
ఉప్పెన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఓవర్సీల్ లో ప్రభావం చూపించలేదు.వంద కోట్ల రూపాయలను సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు.
దాంతో సినిమా ను అక్కడ కు వెళ్లి మరీ జాతి రత్నాలు ప్రమోట్ చేశారు.దాంతో ఉప్పెన సినిమా ను మించి జాతి రత్నాలకు వసూళ్లు నమోదు అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా రికార్డుల వేట కంటిన్యూ చేస్తూనే ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా వసూళ్ల విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నిర్మాత ఇప్పటికే దాదాపుగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా లాభాలను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.మరి ముందు ముందు ఈ సినిమా మరెంతగా వసూళ్లను సాధిస్తుందో చూడాలి.
ఇటీవల కాలంలో వచ్చిన ఏ సినిమా కూడా ఇంతటి భారీ ఎంటర్ టైనర్ సక్సెస్ ను దక్కించుకోలేదు.అందుకే జాతి రత్నాలు భారీ రికార్డులను నమోదు చేస్తుంది.