టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు.గత ఏడాది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్.
ఈ సినిమాతో అవార్డు కూడా అందుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత జాతి రత్నాలు సినిమాతో మరో క్రేజ్ అందుకున్నాడు.
అంతేకాకుండా వరుస ఆఫర్లు కూడా సొంతం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే నవీన్ పొలిశెట్టి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.
కేవలం జాతి రత్నాలు సినిమాతో స్టార్ నైట్ గా మారిన నవీన్ కు ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే.
ఇక ఈ సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు తమ వంతు సహాయం తో ముందుకు వస్తున్నారు.ఇదిలా ఉంటే ఇటీవలే నవీన్ పొలిశెట్టి కు సోషల్ మీడియాలో సాయి స్మరణ్ అనే నెటిజన్ తన తండ్రి కరోనా వల్ల మరణించాడని అప్పటి నుండి తన తల్లి బాధతో క్రుంగి పోతుందని మే 5న ట్విట్టర్లో నవీన్ పొలిశెట్టి ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
జాతి రత్నాలు సినిమా చూసిన తర్వాత తన తల్లి కుదుటపడిందని తెలిపాడు.
ఇక ఈ విషయం గురించి స్పందించిన వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని త్వరలోనే తనని సర్ ప్రైజ్ చేస్తా అంటూ ట్వీట్ చేశాడు నవీన్.ఇక నవీన్ తన తల్లి కి వీడియో కాల్ చేసి మాట్లాడాడు.ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా నవీన్ అభిమానులతో పంచుకున్నాడు.ఆ తల్లి మళ్లీ నవ్విందంటూ.ఈ సమయంలో బాధ నుంచి బయట పడటం కోసం ప్రేమ ఎంతో అవసరమని, చేతనైనంత సాయం చేయండి అని నవీన్ తెలిపాడు.