నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందిన జాతి రత్నాలు సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.పది పన్నెండు ఏళ్లుగా సినిమా ల్లో ఆఫర్ల కోసం నవీన్ తిరుగుతున్నాడు.
ముంబయి వెళ్లి రోజుకు నాలుగు అయిదు స్టూడియోల్లో ఆడిషన్స్ ఇచ్చేవాడట.ఎన్నో కష్టాలు పడ్డ నవీన్ పొలిశెట్టికి ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా తో మంచి గుర్తింపు దక్కింది.
జాతి రత్నాలు సినిమా తో మరో సారి నవీన్ తన ప్రతిభను కనబర్చాడు.ప్రతిభ అనేది ఎప్పటి నుండో ఉన్నా వచ్చే అవకాశంను బట్టి దాన్ని బయటకు తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది.
నవీన్ పొలిశెట్టి కి జాతి రత్నాలు సినిమా ఆఫర్ ను ఇచ్చింది నిర్మాత నాగ్ అశ్విన్అందుకే జాతి రత్నాలు సినిమా విడుదల అయ్యి సక్సెస్ టాక్ వచ్చిన నేపథ్యంలో నవీన్ పొలిశెట్టి చాలా సంతోషంగా నాగ్ అశ్విన్ ను గట్టిగా హత్తుకుని చాలా సేపు అలాగే ఉండి పోయాడు.ఏకంగా ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నాడు.
నవీన్ ను జాతి రత్నాలు ప్రమోషన్ సందర్బంగా చూసిన ప్రతి ఒక్కరు ఒక హీరో మరీ ఇంత చిల్ గా ఉంటాడా.మరీ ఇంత యాక్టివ్ గా ప్రతి విషయాన్నికి స్పాంటినియస్ గా పంచ్ లు వేస్తాడా అనుకున్నారు.
నవీన్ ఒక కొత్త తరహా హీరో అన్నట్లుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇలాంటి సమయంలో ఆయన ఇలా కన్నీరు పెట్టుకున్న వీడియో కనిపించడం సోషల్ మీడియా జనాలకు షాకింగ్ గా అనిపించింది.
మొత్తానికి నవీన్ పొలిశెట్టి ఆనందంతో తన జాతి రత్నాలు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా కన్నీటి సాక్షిగా చెప్పుకొచ్చాడు.నవీన్ తదుపరి సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు.