కరోనా థర్డ్ వేవ్ మొదలు అవ్వడమే సినీ ప్రముఖులను వెంటాడుతోంది.మొదటి వేవ్ మరియు సెకండ్ వేవ్ లో ఎక్కువగా ఇండస్ట్రీ వర్గాల వారికి రాలేదు.
ఆరంభంలో సామాన్యులకు అధికంగా వచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీ వర్గాల వారికి వచ్చింది.కాని ఈసారి థర్డ్ వేవ్ ఆరంభమే ఏకంగా సినిమా ఇండస్ట్రీ వారికి ఎటాక్ ఇచ్చింది.
ఏం చేసినా కూడా ఇండస్ట్రీ వారిని వదిలేదు లేదు అన్నట్లుగా కరోనా వెంట పడుతోంది.ఇప్పటికే మహేష్ బాబు మరియు ఇతర ప్రముఖులకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
ఇదే సమయంలో థమన్ కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.దాంతో ఇండస్ట్రీలో చర్చ మొదలు అయ్యింది.
థమన్ కోవిడ్ పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడానికి కొన్ని గంటల ముందు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరియు హీరో నవీన్ పొలిశెట్టితో కలిశాడు.వీరిద్దరితో పాటు శివ కార్తికేయన్ కూడా ఉన్నాడు.
శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు గాను మ్యూజిక్ సిట్టింగ్ వేశారు.ఒక రాత్రి అంతా కూడా ఈ నలుగురు చాలా సరదాగా స్క్రిప్ట్ ను చర్చించుకుంటూ సంగీతాన్ని ఇచ్చినట్లుగా థమన్ చెప్పుకొచ్చాడు.
థమన్ జోరుకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.ఈ సమయంలో ఆయనకు పాజిటివ్ అంటూ రావడంతో అన్ని గంటలు కలిసి వర్క్ చేసిన శివ కార్తికేయన్.
అనుదీప్ మరియు నవీన్ పొలిశెట్టిలకు కూడా పాజిటివ్ అయ్యే అవకాశాలు కొద్ది లో కొద్దిగా అయినా ఉండి ఉంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీ వర్గాల వారికి కాస్త టెన్షన్ అయితే కలిగిస్తుంది.నవీన్ మరియు అనుదీప్ లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.వారి వల్ల మరెవ్వరికైనా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే ఇప్పటికే వారు స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.