ఒకవైపు సినిమాల్లో హీరో పాత్రల్లో నటిస్తూనే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు నవీన్ చంద్ర.విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమాలో కాజల్, విష్ణులకు కజిన్ పాత్రలో నవీన్ చంద్ర నటించారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన నవీన్ చంద్ర ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మోసగాళ్లు సినిమా ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతోందని నవీన్ చంద్ర తెలిపారు.2,800 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన కథలో కాజల్, విష్ణు అక్కాతమ్ముని పాత్రలో నటించారు.మంచి నటుడిగా ప్రూవ్ చేసుకోవాలని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని.
తాను ఇప్పటివరకు కథలను నడిపించే పాత్రలలోనే ఎక్కువగా నటించానని నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు.ప్రస్తుతం అర్ధశతాబ్దం అనే మూవీలో హీరోగా నటిస్తున్నానని నవీన్ చంద్ర పేర్కొన్నారు.
రానా విరాటపర్వం, వరుణ్ తేజ్ గని సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నానని నవీన్ చంద్ర తెలిపారు.మోసగాళ్లు సినిమా షూటింగ్ టైమ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తనను చూసి భయపడిందని నవీన్ చంద్ర వెల్లడించారు.
సినిమాలో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని.డ్రగ్స్ కు అలవాటు పడిన క్రూరమైన వ్యక్తి పాత్రలో తాను నటిస్తున్నానని.
ఆ పాత్రలో తనను చూసి కాజల్ భయపడిందని వెల్లడించారు.
కమర్షియల్ ఫిల్మ్స్ లో నటించడానికి ఆసక్తి చూపితే మంచి సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఆర్కా మీడియా నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నానని వెల్లడించారు.ఈ నెల 19వ తేదీన విడుదల కానున్న మోసగాళ్లు సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని విష్ణు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.