పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవి గురించి కొద్దిరోజులుగా జరుగుతున్న హంగామా తెలిసిందే.రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఊహాగానాలు ఉండగా ఫైనల్ గా పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది.
సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది.ఎవరు ఎంత అసంతృప్తి వ్యక్తం చేసినా సరే అధిష్టానం మాత్రం సిద్ధూకే ఓటు వేసింది.
సిద్ధూని పీసీసీ అధ్యక్షుఇగా నియమిస్తూ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ పేరిట లేఖ రిలీజ్ చేశారు.
తక్షణమే అమలులోకి వచ్చేల లేఖలో పేర్కొన్నారు.
సిద్ధూ తో పాటుగా మరో నలుగురు సభ్యులను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం.సంగత్ సింగ్ గిల్జియన్, సుఖ్వీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, ఖుల్జీత్ సింగ్ నగ్రా లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిగా కానివ్వకుండా చివరి వరకు అడ్డు పడ్డారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్.ఆయన్ వర్గీయులు కూడా చివరు వరకూ ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది.
పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవ జ్యొత్ సింగ్ సిద్దు ఎంపికయ్యారు.పీసీసీ చీఫ్ గా ఆయన తన మార్క్ చూపిస్తారో లేదో చూడాలి.