సినిమాలలో ఎప్పుడు నటించే హీరోల లో ఒకే రకమైన ఫీల్ ఉంటే అదే రకం తో మరో సినిమాలను చూడాలనిపిస్తుంది.అంతేకాకుండా ఎప్పుడు నవ్విస్తూ నవ్వించే హీరోలు ఒకేసారి సీరియస్ నటనలో నటిస్తే అంతే సంగతి.
ఎందుకంటే వాళ్ళు కామెడీ పరంగా సినిమాలను చేస్తే తర్వాత వచ్చే.వాళ్ల సినిమాలను కూడా అదే తరహాలో చూడాలనిపిస్తుంది.
ఒకేసారి వాళ్ళలో సీరియస్ నెస్ కనిపిస్తే ఎందుకో అంత ఆసక్తి అనిపించదు.ఇలాగే హీరో సునీల్ కమెడియన్ గా ఉండి హీరోగా అంతగా మెప్పించకపోయేసరికి, తిరిగి మళ్లీ హాస్యనటుడుగా చేస్తున్నారు.
కానీ అల్లరి గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ కు మాత్రం సీరియస్ పాత్రతో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
హాస్య ప్రధానమైన చిత్రాలలో నటించిన అల్లరి నరేష్ కు. అల్లరి అనే సినిమాలో తొలిసారిగా పరిచయము కాగా అప్పటి నుంచి అల్లరి నరేష్ గా పేరు మారింది.ఇక ఆయన సినిమాలన్నీ ఎక్కువగా హాస్య పరంగా తెరకెక్కాయి.
తాజాగా విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమా ‘నాంది’.ఇందులో అల్లరి నరేష్ హీరోగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించింది.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల అవ్వగా.అల్లరి నరేష్ కి ఈ సినిమా టాక్ ఆఫ్ ది గా మూవీగా మారింది.
ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక నాచురల్ హీరో నాని ఈ సినిమాను చూసి ఫిదా అయ్యాడు.దీంతో ట్విట్టర్ వేదికగా ‘ఇంక చాలు’ అని ట్వీట్ తో.‘రేయ్ రేయ్ రేయ్.అల్లరి నరేష్ పేరు మార్చేయ్.ఇంక అల్లరి గతం, భవిష్యత్తుకు ఇది నాంది‘.ఇక పై అల్లరి అని తీసేసి.మంచి గుర్తింపుతో వచ్చిన నాంది అని ఆడ్ చేసుకో అని అర్థం.
ఇక ఒక గొప్ప నటుడిని తనలో చూశానంటూ, ఇక నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అంటూ నాని కోరాడు.