తమిళంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన రాజా రాణి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
తెలుగులో కూడా ఈ సినిమా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీమ్ ఈ సినిమాలో నటించారు.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 బాక్సాఫీస్ వద్ద ఏకంగా 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.
అయితే ఈ రెండు సినిమాలలో నటించే అవకాశం వచ్చినా హీరో నాని ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారని సమాచారం.
టక్ జగదీష్ ప్రమోషన్స్ లో భాగంగా నాని ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.నాని మాట్లాడుతూ తనకు రీమేక్ లలో నటించే ఆలోచన అస్సలు లేదని చెప్పుకొచ్చారు.
సినిమాను థియేటర్లలో చూడటమంటే ఇష్టమని కానీ కరోనా వల్ల పరిస్థితులు మారిపోయాయని నాని అన్నారు.
తాను బిగ్ స్క్రీన్ ను మిస్ అవుతున్నానని వరుస సినిమాలను సిద్ధం చేస్తున్నానని నాని తెలిపారు.
రాజా రాణి కథ నచ్చిందని వేరే సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉండటంతో ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని నాని చెప్పారు.ఎఫ్2 సినిమా విషయంలో కూడా ఇదే విధంగా జరిగిందని నాని తెలిపారు.ఎఫ్2 సినిమాను వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల వదులుకోవాల్సి వచ్చిందని నాని పేర్కొన్నారు.
వి సినిమా ఆడలేదని చాలామంది అంటారని ఆ సినిమా హిట్ అని ప్రూవ్ చేయడానికి తన దగ్గర కలెక్షన్ల రికార్డులు లేవని నాని పేర్కొన్నారు.మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఇతర ప్రాంతాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నాని చెప్పుకొచ్చారు.రెండు సంవత్సరాల తర్వాత పాన్ ఇండియా అనే పదం వినిపించకపోవచ్చని నాని కామెంట్లు చేశారు.