న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు.ఎందుకంటే ఈయన మొదటి నుండి విభిన్న కథలతో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కుంటూ వచ్చాడు.
అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.ఇక నాని చేతిలో ప్రెజెంట్ క్రేజీ సినిమాలు ఉన్నాయి.
ఇలా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మారి చిన్న చిన్న సినిమాలను తన బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.ఇక ఇటీవలే నాని అయ్యప్ప మాలధారణ దీక్ష కూడా పూర్తి చేసారు.
నవంబర్ నెల మొత్తం అయ్యప్ప దుస్తుల్లోనే కనిపించిన నాని ఇప్పుడు తన సివిల్ లుక్ లోకి వచ్చారు.అయితే తాజాగా నాని ఒక ఫోటోను షేర్ చేసారు.
డిసెంబర్ నెలకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ నాని తన క్రేజీ పిక్ ను షేర్ చేయగా అది ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ ఫొటోలో నాని అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని గుబురు గడ్డం.
న్యాచురల్ లుక్ తో న్యాచురల్ స్టార్ నాని అదిరిపోయాడు అనే చెప్పాలి.ఈయన లుక్ అందరికి ఆకట్టుకుంది.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.ఈ రోజు నాని నిర్మించిన హిట్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా హిట్ 1 సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించాడు.
ఇక నాని ప్రెజెంట్ దసరా సినిమా చేస్తున్నాడు.శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు.2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.చూడాలి ఈ సినిమాతో నాని సాలిడ్ హిట్ అందుకుంటాడా లేదా.