మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి వివేక్ ఆత్రేయ.ఆ తరువాత మరోసారి బ్రోచేవారెవరురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
మొదటి రెండు సినిమాలతో క్లాస్ట్ దర్శకుడుగా, మంచి టేస్ట్ ఉన్న కుర్రాడిగా ముద్ర వేసుకున్న వివేక్ ఆత్రేయ ఇప్పుడు ఊహించని విధంగా నేచురల్ స్టార్ నానితో సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.తాజాగా నానికి వివేక్ ఓ కథ చెప్పడం జరిగిందని, అది నానికి భాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడని తెలుస్తుంది.
ప్రస్తుతం వి సినిమా షూటింగ్ లో ఉన్న నాని నిర్మాతగా హిట్ సినిమాతో మొదటి హిట్ కొట్టాడు.తన నెక్స్ట్ సినిమాని టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ సినిమా పూర్తయిన తర్వాత వివేక్ చెప్పిన కథని తెరపైకి తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్పించడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తుంది.
దీనిపై త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలకి భిన్నంగా యంగ్ టాలెంటెడ్ దర్శకులతో డిఫరెంట్ కాన్సెప్ట్ ముందుకి వెళ్ళడం విశేషం.