నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కించి ఇద్దరు దర్శకులని టాలీవుడ్ కి పరిచయం చేశాడు.ప్రశాంత్ వర్మని “ఆ!” సినిమాతో శైలేష్ కొలనుని హిట్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం చేశాడు.
ఈ టాలెంటెడ్ దర్శకులు తమకొచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా వాడుకొని సక్సెస్ అయ్యారు.ప్రశాంత్ వర్మ తాజాగా జాంబీరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
ఈ సినిమా పర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది.కంటెంట్ బేస్ కథలతో ఈ దర్శకుడు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
ఇక హిట్ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని సీక్వెల్ ని తాజాగా ఎనౌన్స్ చేశాడు. ఓ కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టొరీగా హిట్ మూవీని తెరకెక్కించారు.
ఆద్యంతం సస్పెన్స్ కథాంశంతో దర్శకుడు కథని చెప్పిన విధానం అందరికి కనెక్ట్ అయ్యింది.దీంతో హిట్ మూవీకి హిట్ వచ్చింది.
యంగ్ టాలెంటెడ్ విశ్వక్ సేన్ కి ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ వచ్చింది.ప్రస్తుతం ఈ కుర్ర హీరో పాగల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని తన బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 3గా హిట్ సీక్వెల్ ని ఎనౌన్స్ చేశాడు.
హిట్ 2 చిత్రాన్ని ప్రకటించడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు.కనిపించకుండా పోయిన అమ్మాయి కేసును ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు ఎలా డీల్ చేశారనే కథాంశంతో తెలంగాణ హిట్ టీమ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా హిట్ సినిమాను రూపొందించాం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన హిట్ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ కేసును ఆఫీసర్ కె.డి ఆసక్తికరంగా ఎలా డీల్ చేస్తారో చూపించబోతున్నాం.అంటూ నాని సినిమాని ఎనౌన్స్ చేశారు.