ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరోయిన్ సాయి పల్లవి.మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ అభిమానులని సొంతం చేసుకున్న ఈ భామ తరువాత వెనుతిరిగి చూసుకునే అవకాశాలు లేకుండా మంచి సినిమాలు చేస్తూ వచ్చింది.
స్టార్ట్ హీరోల సినిమాలు అయిన తన పాత్ర నచ్చితేనే ఈ భామ ఒకే చెబుతుంది అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా ఉంది.ఈ కారణంగానే మంచి గుర్తింపు ఉన్న చాలా లిమిటెడ్ గా సినిమాలు చేస్తుంది.
డబ్బు కంటే తన మార్క్ చూపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాతో పాటు శేఖర్ కమ్ములతో లవ్ స్టొరీ సినిమాలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాలో నేచురల్ స్టార్ నానికి జోడీగా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే వీరిద్దరు ఎంసిఏ సినిమాలో జోడీగా నటించారు.ఇప్పుడు నాని యువ దర్శకుడు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయాన్ దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమా కోసం సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న సినిమాలు కంప్లీట్ కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.