సెయింట్ లూయిస్: నవంబర్ 4: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఈ సారి సరికొత్తగా ఆలోచించింది.క్యాన్సస్ లో నాట్స్ పానీ పూరి స్టాల్ ఏర్పాటు చేసింది.
నాట్స్ సభ్యులు ఒక్క రోజు పానీ పూరి స్టాల్ ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని హిందు దేవాలయానికి విరాళంగా ఇచ్చారు.నాట్స్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది.1500 డాలర్ల పానీ పూరి స్టాల్ ద్వారా లభించడంతో నాట్స్ సంతృప్తి వ్యక్తం చేసింది.
దీనిని స్థానిక హిందుదేవాలయ నిర్మాణానికి విరాళంగా అందించింది.క్యాన్సస్ లో నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడంపై స్థానిక తెలుగువారు హర్షం వ్యక్తం చేశారు.క్యాన్సస్ నాట్స్ చాప్టర్ ఇలా వినూత్నంగా ముందుకు వెళ్లడంపై నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి క్యాన్సస్ నాట్స్ నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.