ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అమెరికాలో సేవాకార్యక్రమాల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు వారందరూ గర్వపడేలా నాట్స్ సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందు ఉంటుంది.
అమెరికాలో ఎవరికీ ఎటువంటి ఆపద వచ్చినా సరే నేనున్నాను అంటూ ముందు నిలుస్తుంది నాట్స్.ఈ క్రమంలోనే అమెరికాలో ఇటీవల కాలంలో ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్న కోయ్యలమూడి శ్రీరామమూర్తి ప్రాణాలు నిలబెట్టేందుకు తన వంతు సాయంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టింది.
అతని వైద్య ఖర్చులు భరించేందుకు, అతడి కుటుంభ సభ్యులకి భరోసా కల్పిస్తూ నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది.అందుకోసం ఫిలడెల్ఫియాలోని స్థానికంగా ఉన్న తెలుగు సంఘంతో కలిసి “రన్ ఫర్ రామ్” పేరుతో 5 కె రన్ ప్రారంభించింది.ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలని రామ్మూర్తి కుటుంభానికి అందించనుంది.
“రన్ ఫర్ రామ్” సందర్భంగా తెలుగు వారు దాదాపు 120 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామ్మూర్తి కి మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమానికి అమెరికాలోని నాటా, ఆటా, తానా వంటి సంస్థలు కూడా మద్దతు ఇచ్చాయి.
ఆయా సంస్థ ప్రతినిధులు సైతం పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.