సోషల్ మీడియా, దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు.దీని వలన వచ్చే ఉపయోగాలకంటే కూడా అనర్ధాలే ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా యువతీ యువకులుపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.దాంతో ఈ అంశంపై నాట్స్ ఫ్లోరిడాలోని టాంపా లో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రవాస యువతీ యువకులు, స్థానిక యువతీ యువకులు సైతం వచ్చి తమతమ సందేహాలని నివృత్తి చేసుకున్నారు.సోషల్ మీడియా దుష్ప్రభావాలపై నిపుణులు అయిన మార్టిన్ స్పెన్సర్ ఈ సదస్సులో చక్కగా వివరించారు.
యువత సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ కార్యక్రమంలో సూచనలు చేశారు.సోషల్ మీడియాకు బానిస అవ్వకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వివరించారు.విద్యార్ధులకి, వారి తల్లి తండ్రులకి రాజితా నిడదవోలు దిశానిర్దేశం చేశారు.