జాతీయ క్రీడా అయిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్బంగా నిర్వహిస్తారు.ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు.
ఈ రోజు క్రీడాకారులందరికి ఒక్క పండగలాంటిది.అంతేకాదు ఈ రోజున వేడుకను నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను, కోచ్ లకు అవార్డులను ప్రదానం చేసి సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది.
భారత జాతీయ క్రీడా అయిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గొప్ప పేరు సంపాదించుకున్నాడు.ఇక ధ్యాన్చంద్ తన జట్టుతో మూడు ఒలింపిక్ బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు.
అంతటి మహానుభావుడి పుట్టినరోజును ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించేలా కేంద్రం క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తుంది.ఈ సంవత్సరం ఖేల్ రత్నకి ఐదుగురు ఎంపిక చేశారు.
ఇక అర్జునకి 27 మందని మొత్తంగా 74 మంది అవార్డులకి అవార్డులను అందిస్తున్నారు.ఇక ఎవరి ఎవరికీ ఈ అవార్డులు వరించాయో చూద్దామా….రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకి ఎంపికైన క్రీడాకారుల వివరాలు చూస్తే… రోహిత్ శర్మ (క్రికెట్), రాణి రాంపాల్ (హాకీ), మనిక బాత్ర (టేబుల్ టెన్నిస్), వినేశ్ పొగట్ (రెజ్లింగ్), మరియప్పన్ (పారా అథ్లెటిక్స్)
ఇక అర్జున అవార్డుకి ఎంపికైన క్రీడాకారుల వివరాలు చూస్తే… ఇక ఇషాంత్ శర్మ (క్రికెట్), ద్యుతీ చంద్ (అథ్లెట్), అతాను దాస్ (ఆర్చరీ), దీప్తి శర్మ (క్రికెట్), సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి (బ్యాడ్మింటన్), విశేష్ (బాస్కెట్ బాల్), చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్), సుబేదార్ కౌశిక్ (బాక్సింగ్),శావంత్ అజయ్ (ఈక్వెస్ట్రైన్), సందేశ్ (ఫుట్బాల్), లోవ్లినా (బాక్సింగ్), అదితి అశోక్ (గోల్ఫ్), దీపిక (హాకీ), దీపక్ (కబడ్డీ), సుందర్ (ఖోఖో), అక్షదీప్ సింగ్ (హాకీ), దత్తు బాబన్ (రోయింగ్), మనుబాకర్ (షూటింగ్), సౌరబ్ చౌదరి (షూటింగ్), మధురిక (టేబుల్ టెన్నిస్), దివిజ్ శరణ్ (టెన్నిస్), శివ కేశవన్ (వింటర్ స్పోర్ట్స్) , దివ్య (రెజ్లింగ్), రాహుల్ (రెజ్లింగ్), నారాయణ యాదవ్ (పారా స్మిమ్మింగ్), సందీప్ (అథ్లెట్), మనీశ్ అవార్డులకు ఎంపిక అయ్యారు.ఇక ఈ సంవత్సరం ఖేల్రత్నకి ఐదుగురు ఎంపికవగా.మొత్తం 27 మంది అర్జునకి అవార్డులకి ఎంపిక అయ్యారు.