ఏపీలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తమ ప్లాంట్ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కియా కంపెనీని ఇబ్బందులు పెడుతున్నారని, దాంతో కియా కంపెనీ తమిళనాడుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలో కథనం వచ్చింది.
ఆ మీడియా సంస్థ కథనంకు ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడేఎక్కింది.ఎలాగూ కొత్త కంపెనీలను తీసుకు రాలేరు, కనీసం ఉన్న కంపెనీలను కూడా నిలుపుకోలేరా అంటూ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కియా కంపెనీ మరియు ప్రభుత్వం కూడా కియా కంపెనీ వెళ్లడం లేదంటూ ప్రకటించారు.ఆ రెండు ప్రకటనలతో కాస్త పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగా అనిపించినా కూడా మళ్లీ మొదటికి వచ్చింది.
కియా తరలింపు విషయమై తాము ప్రచురించిన కథనం నిజమే అని, అందులో ఎలాంటి అనుమానం లేదు అంటూ మరోసారి ఆ మీడియా సంస్థ పేర్కొంది.తమకు ఉన్న సమాచారం ప్రకారం కియా తరలింపు త్వరలోనే ఉంటుందని అంటున్నారు.
ఈ వివాదం ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.కియా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.