ఓ వైపు చిత్ర పరిశ్రమలో కరోనా మరణాలు వెంటాడుతూ ఉంటే తాజాగా కన్నడ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడుగా జాతీయ అవార్డు సైతం గెలుచుకున్న సంచారి విజయ్ మృతి చెందడం తీవ్ర విషాదం నెలకొంది.కన్నడ నాట హీరోగా రాణిస్తున్న సంచారి విజయ్ మొదటి చిత్రంలోనే హిజ్రా పాత్రలో నటించి అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించడంతో నేషనల్ అవార్డుని అందుకున్నాడు.
తరువాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.అయితే తాజాగా బెంగుళూరులో లాక్ డౌన్ అమల్లో ఉన్న కూడా ఫ్రెండ్స్ తో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
వెంటనే అతన్ని అపోలో హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు.కిచ్చా సుదీప్ దగ్గరుండి అతని ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చి విజయ్ ని బ్రతికించే ప్రయత్నం చేయాలని కోరాడు.
అయితే హాస్పిటల్ లో తీసుకొచ్చే సమయానికి తలకి తీవ్రమైన గాయాలు కావడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇక అతని మరణాన్ని తాజాగా నిర్ధారించారు.ఇక విజయ్ అవయవాలు దానం చేయడానికి అతని తల్లిదండ్రులు ముందుకొచ్చారు.ఇదిలా ఉంటే విజయ్ మృతితో కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సిని సెలబ్రిటీ, రాజకీయ ప్రముఖులు అతని మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసి నివాళి అర్పించారు.ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న హీరో ఇలా అర్ధంతరంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు.
గతంలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటులు రోడ్డు ప్రమాదాలకి గురై మృత్యువాత పడటంతో మరోసారి సంచారి విజయ్ మరణం వారిని గుర్తుచేసింది.