ఈ సృష్టిలో ఏది జరిగినా దానికి ఓ బలమైన కారణం ఉండే ఉంటుందనేది అనాది నుంచి వస్తున్న మాట.ఇప్పటికే మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నా కూడా ఇంకా తన అన్వేషన మాత్రం ఆపకుండా నిత్యం ప్రయాణం చేస్తూనే ఉన్నాడు.
ఇక ఇందులో భాగంగా ఆయన చేస్తున్న ప్రయాణం అంతరిక్షం వైపు.అసలు అంతరిక్షంలో నీటి జాడ ఉందా లేదా కనుగొనేందుకు మనిషి ఇప్పటికీ అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడని చెప్పాలి.
అనంత విశ్వంలో ఈ భూమ్మీదనే మానవుడు ఒంటరిగా లేడని కచ్చితంగా ఏదో గ్రహంపై వివిధ రకాల జీవరాశులు బ్రతికే ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆ దిశలో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.
ఇక ఇదే క్రమంలోనే ఈ అనంత విశ్వంలోనే అతి పెద్ద గ్రహం అయిన చంద్రుడు అలాగే గురు గ్రహ ఉపగ్రహం అయిన గనీ మీడ్పై పెద్ద ఎత్తున ఎన్నో ఏండ్లుగా హబుల్ టెలిస్కోప్తో పరిశోధనలు చేస్తున్నారు మన వివ్వ సైంటిస్టులు.
అయితే రీసెంట్ గా ఈ టెలిస్కోప్ ద్వారా వచ్చిన ఓ డేటాను పూర్తి స్థాయిలో పరిశీలించిన నాసా సైంటిస్టులు అ విషయాన్ని చెబుతున్నారు.అదేంటంటే ఉపగ్రహం అయిన గనీమీడ్ క్రస్ట్ కింద దాదాపు 100 మైళ్ల దూరంలో చాలా వరకు మహాసముద్రాలు ఉన్నాయని అవి ఎంతో ప్రసిద్ధి చెందినవని చెబుతున్నారు.
నిజంగా చెప్పాలంటే అవి ఈ భూమిపై కంటే ఎక్కువ పరిమాణంలో విస్తరించి ఉన్నాయని, చాలా పెద్దగా ఉన్నాయని సైంటిస్టులు వివరిస్తున్నారు.అయితే ఈ ఉపగ్రహంపై ఏదైనా జీవరాశి ఉందో లేక కేవలం నీరు మాత్రమే ఉందా అనే విషయాలను కనుగొనడం ఒక కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.కాగా ఇతర గ్రహాలపై ఒకవేళ నీటి జాడ ఉన్నా కూడా వాటిపై మానవులు జీవించే ఆస్కారం లేదని నాసా వివరిస్తోంది.ఎందుకంటే వాటిపై మానవ మనుగడకు అవసరమైన పరిస్థితులు లేవని అసలు ఉండే అవకాశం కూడా లేదని సైంటిస్టులు చెబుతున్నారు.