అంగారక గ్రహంపై జీవం ఉందా, ఈ గ్రహం నివాసయోగ్యమైనదేనా అనే కోణంలో శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు.అయితే తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంగారక గ్రహం మీద తలుపు ద్వారం లాంటి ఒక నిర్మాణం (డోర్వే) కనుగొన్నది.
దీనికి సంబంధించిన ఓ ఫోటోను నాసా అందరితో పంచుకుంది.ఈ ఫొటోని మార్స్ రోవర్ క్యూరియాసిటీ క్యాప్చర్ చేసింది.
ఈ ఫొటోలో ఒక పెద్ద రాయికి ఒక తలుపు లాంటి ద్వారం ఎవరో చెక్కినట్లుగా కనిపిస్తోంది.ఇది చూసిన నెటిజన్లు అబ్బురపడుతున్నారు.నిజంగానే అంగారక గ్రహం పై జీవులు ఉన్నాయి? తలుపులు, ద్వారాలు నిర్మించే గ్రహాంతరవాసులు ఉన్నారా అని నెటిజన్లు ఇప్పుడు అనేక చర్చలు జరుపుతున్నారు.ఇది ఏలియన్లు నిర్మించిన ద్వారమైననే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే మార్స్ పై కనిపించిన డోర్వే మిస్టరీ గుట్టు విప్పేందుకు పరిశోధకులు నడుంబిగించారు.వారి పరిశోధనలో అదొక రాయి భాగం మాత్రమే అని తేలింది.భూమిపై భూకంపాలు వచ్చినట్టు అంగారక గ్రహం పై కూడా కంపనాలు, ప్రకంపనలు వస్తుంటాయి.
మే 4న కూడా భారీ కంపనాలు సంభవించినట్లు నాసా గుర్తించింది.ఈ నేపథ్యంలో ద్వారం లాంటి రాయి ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.రోవర్ ప్రత్యేకమైన యాంగిల్లో ఈ ఫొటోని క్యాప్చర్ చేసింది అందుకే అది ప్రత్యేకంగా కనిపించింది.
అది సెంటీమీటర్లు లేదంటే అంగుళాల సైజులో మాత్రమే ఉంటుందని పరిశోధనలు చెబుతున్నారు.దీనిపై మరింత పరిశోధన చేసి ఇది ఏంటో పూర్తిస్థాయిలో కనుగొన్నామని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.