అమెరికాలో అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దశాబ్దాలుగా అంతరిక్షంలో పరిశోధనలు చేస్తూనే ఉంది.ఈ అంతరిక్క్ష పరిశోధనలలో భాగంగా అక్కడ మానవ మనుగడకి నివాసం యోగ్యం ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పుడెప్పుడో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ని అంతరిక్షంలో చంద్రుడు మీదకి పంపించాం అని చెబుతున్న నాసా మరల ఇప్పటి వరకు అలాంటి ప్రయోగంతో సక్సెస్ కాలేకపోయింది.అప్పట్లో కల్పనాచావ్ల అంతరిక్క్షంలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన రాకెట్ ఫెయిల్ అయ్యి అందరూ చనిపోయారు.
అయితే సునీతా విలియమ్స్ టీం మాత్రం అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చారు అనేది అమెరికా చెబుతుంది.
ఇదిలా ఉంటే అమెరికా పరిశోధన కేంద్రం నాసాతో పాటు, అమెజాన్ సంస్థ కూడా 2020 నాటికి అంతరిక్షంలోకి మనుషులని పంపించడమే కాకుండా అక్కడ వ్యాపార సంబంధ వెంచర్లకి కూడా అనుమతి ఇస్తామని నాసా ప్రకటించింది.
ఇక ప్రైవేట్ వ్యక్తులని కూడా, పర్యాటకానికి అంతరిక్షంలోకి పంపిస్తామని తెలియజేసింది.అయితే అంతరిక్ష కేంద్రంలో ఉండటానికి ప్రైవేట్ వ్యక్తులు ఒక్కో రాత్రికి 35 వేల డాలర్లు అంటనే సుమారు 24.27 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నాసా తెలియజేసింది.నాసా ప్రకటన చేసిన అంతరిక్షంలోకి ప్రైవేట్ వ్యక్తులని పంపించడం ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది తెలియాలంటే మరో ఏడాది వేచి చూడాల్సిందే.