అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా దశాబ్దాలుగా అంతరిక్షంలో జీవ ఉనికి, అలాగే సహజ వనరుల గురించి పరిశోధనలు చేస్తుంది.ముఖ్యంగా మనకి అత్యంత సమీపంలో ఉండే ఉపగ్రం చంద్రుడుపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంది.
ఇప్పటికే చంద్రుడుపైకి చాలా దేశాలు మనిషిని కూడా పంపించాయి.ఇక వేరే గ్రహాలలో మానవుడు నివాసానికి అనువైన వాతావరణం ఉందా అనే దిశలో పరిశోధనలు చేస్తున్నారు.
వీటికి సమాధానంగా నాసా సంచలన విషయం బయటపెట్టింది.
చందమామపై ఉల్కలు పడినప్పుడు చందమామలోపలి నీరు పైకి చిమ్ముకుంటూ వచ్చిందని నాసా కనిపెట్టింది.
చందమామ పై తిరుగుతున ల్యూనార్ అట్మాస్పియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లోరర్ సేకరించిన డేటాను విశ్లేషించిన నాసా, చందమామ ఉపరితలం నుంచీ 3 అంగుళాల లోపల నీరు ఉన్నట్లు గుర్తించింది.ఇదే విషయాన్ని నాసాకి చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ కేంద్రం నేచర్ జియోసైన్సెస్లో ప్రచురించింది.
చందమామ లోపల ఉన్న నీరు ఉందని చెబుతున్న నాసా ఆ దిశగా మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధం అవుతుంది.చందమామ
.