ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒక్కటే.అదే వికె నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతి ట్రయాంగిల్ రిలేషన్ షిప్.
పవిత్ర లోకేష్ నరేష్ వికె లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండగా.తనకు విడాకులు ఇవ్వకుండానే ఇప్పుడు మరో పెళ్ళికి ఎలా సిద్ధమవుతాడు అంటూ రమ్య రఘుపతి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇటీవలే ఒక హోటల్ లో ఉన్న నరేష్ పవిత్ర లోకేష్ ను రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం.ఏకంగా వారిని చెప్పుతో కొట్టెందుకు ప్రయత్నించడంతో .ఈ వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
రమ్య రఘుపతి నరేష్ మూడో భార్య కాగా.
ఇక నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాక్.ఒకసారి వివరాల్లోకి వెళితే సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెతో విజయనిర్మల కొడుకు నరేష్ కు పెళ్లి చేశారు.
ఈ దంపతులకు నవీన్ విజయ్ కృష్ణ అనే కుమారుడు కూడా ఉన్నాడు.నవీన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎందుకో సక్సెస్ కాలేకపోయాడు.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన నవీన్ ఆలనాపాలనా మాత్రం మొత్తం చూసుకునేవాడు.ఇక ఆ తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియ ను రెండో పెళ్లి చేసుకున్నాడు నరేష్.
వీరికి కూడా ఓ కుమారుడు ఉన్నాడు.వీరిద్దరూ విడిపోయినప్పటికీ ప్రస్తుతం ఓ ఎన్జీవో కోసం మాత్రం ఇంకా కలిసి పని చేస్తున్నారు అని చెప్పాలి.
50 ఏళ్ల వయసు దాటిన తర్వాత మాజీ మంత్రి నీలకంఠం రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతినీ మూడో పెళ్లి చేసుకున్నాడు నరేష్.అప్పటికి ఆమె వయస్సు ముప్పై ఏళ్ళ లోపే ఉండడం గమనార్హం.వీరి మధ్య 20 ఏళ్లకు పైగా ఉండడంతో వీరి పెళ్లి అప్పట్లో హాట్ టాపిక్గా మారిపోయింది.అయితే వీరికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు.పెళ్ళయిన రెండేళ్ళకే మనస్పర్ధల తో వీరిద్దరూ విడిపోయారు అని చెప్పాలి.ఇప్పుడు సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు నరేష్.
త్వరలో వీరి పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా ఉంది అని చెప్పాలి.