ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మద్యం దుకాణాలను మూసివేసి మందుబాబులకు ప్రభుత్వ అధికారులు షాక్ ఇచ్చారు.
ప్రస్తుతం కరోనా ప్రభావిత ప్రాంతాలను గ్రీన్, ఆరెంజ్ మరియు రెడ్ జోన్లుగా విభజించి కరోనా ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.అందులో భాగంగా గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచి మద్యం అమ్మకాలు చేపట్టారు.
ఈ విషయంపై పై తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ స్పందించారు.
ఇందులో భాగంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా “శుభోదయం , ఈ రోజు అనంతపురంలోని కొన్ని మద్యం దుకాణాలను తెరవడంతో ప్రజలు స్కూలు విద్యార్థుల లాగా ఆరడుగుల సామాజిక దూరం పాటిస్తూ ఎలా పద్ధతిగా లైన్లో నిల్చున్నారో చూడండి అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
అంతేగాక ఈ క్రమశిక్షణను చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని అంటూ కూడా పేర్కొన్నారు.అలాగే ఈ విషయానికి సంబంధించి వీడియోని కూడా ట్వీట్ కి జోడించారు.దీంతో సీనియర్ నటుడు నరేష్ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక పలువురు ఈ ట్వీట్ పై పలు రకాల ట్రోల్స్, మీమ్స్ కూడా చేస్తున్నారు.
అయితే గ్రీన్ మరియు ఆరెంజ్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరవడంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక ఇంకొన్ని రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి ఉంటే కచ్చితంగా కరోనా చావుల కంటే మందు కోసం విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయ్యేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి మద్యం దుకాణాలు తెరవడంతో మందుబాబులు మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు.దీంతో పోలీసులు వీరిని అదుపు చేయడం కోసం నానా తంటాలు పడుతున్నారు.
మరోపక్క కొందరు ప్రజాసంఘాలు మరియు ప్రముఖ వైద్యాధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుంటే మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని కాబట్టి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పోలీసులను కోరుతున్నారు.