ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన సభ్యులు.తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రచారంలో.ఎదురైన చేదు అనుభవాలు.
మీడియా సముఖంగా తెలియజేస్తూ రాజీనామా.చేయడం జరిగింది.
ఈ క్రమంలో నటుడు ఉత్తేజ్. మాట్లాడుతూ సినిమాకి లోకల్, నాన్ లోకల్ అనేది ఉండదని పేర్కొన్నారు.
సినిమా అన్న పదమే లోకల్ కాదని స్పష్టం చేశారు.ప్రకాష్ రాజ్ ఎక్కడి నుండో వచ్చినా గాని ఒక విజన్ ఉన్న వ్యక్తి అని.అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం కలిగిన మనిషి అని స్పష్టం చేశారు.ఈ క్రమంలో నరేష్ ప్రవర్తించిన తీరు పై.ఉత్తేజ్ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు.పోలింగ్ రోజు నరేష్ తన దగ్గరికి వచ్చి ముఖం పై ముఖం పెట్టి… ఒక్కొక్క అంటూ బండబూతులు తల్లిపై విమర్శించారని ఎలా గెలుస్తారో చూస్తాను.
అంటూ నరేష్ కామెంట్లు చేశాడని ఉత్తేజ్ పేర్కొన్నారు.
ఆయన “మా” అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అని ఆఫీసులో ప్రవేశించాలంటే తంబ్ ఇంప్రెషన్ వేయాల్సిన పరిస్థితి ఉండేదని, ఎన్నో సేవలు ఇండస్ట్రీకు అందించిన చిరంజీవి విషయంలో కూడా నరేష్ తప్పుగా వ్యవహరించారని.
మొదటి నుంచి వేర్పాటువాదం అన్న తరహాలో.నరేష్ వ్యవహారం ఉందని తెలిపారు.30 సంవత్సరాలుగా బెనర్జీ నీ.చూస్తూ ఉన్నాను.
ఆయన ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి చూడలేదు అంత దారుణంగా ఎన్నికల సమయంలో బెనర్జీని కించ పరిచారు అంటూ ఉత్తేజ్ ఆవేశంగా మాట్లాడారు.అంతమాత్రమే కాక తన భార్య చనిపోయిన సమయంలో మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ కనీసం పలకరించలేదు అని మానవత్వం లేని మనిషి నరేష్… అటువంటి వ్యక్తి తో కలిసి పని చేయటం.నంద్యాల పడటం తమ వల్ల కాదు అంటూ.ఉత్తేజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ఇక అదే సమయంలో విష్ణు అధ్యక్షుడిగా.“మా” సభ్యులకు న్యాయం చేయాలని కోరారు.