రోజు రోజుకు నటుడు నరేష్ పవిత్ర లోకేష్ రమ్య వివాదం రచ్చరచ్చగా మారుతుంది.ఇలా వీరి మధ్య తలెత్తిన వివాదం తారా స్థాయికి చేరుకుంది.
ఏకంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లారు.ఇలా రమ్య నరేష్ పవిత్ర లోకేష్ మధ్య జరుగుతున్న ఈ విషయంపై నటి పూజిత స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నరేష్ కు చెల్లెలు లాంటిదానిని వారింట్లో జరిగే ప్రతి విషయాలు తనకు తెలుస్తాయని పూజిత వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈమె నరేష్ గురించి మాట్లాడుతూ నరేష్ తన జీవితంలో చాలా కోల్పోయారని పూజిత వెల్లడించారు.
భగవంతుడు నరేష్ కు మంచి ఆస్తుపాస్తులను ఇచ్చారు కానీ సరైన భార్యను మాత్రం ఇవ్వలేదని నటి పూజిత వెల్లడించారు.ఈ క్రమంలోనే నరేష్ భార్య రమ్య గురించి ఈమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నరేష్ ని పెళ్లి చేసుకున్నప్పుడు రమ్య తన ఫ్యామిలీ గురించి ఎంక్వయిరీ చేయాల్సింది అలా కాకుండా పెళ్లి చేసుకుని అతనికంత మందితో సంబంధం ఉంది అంటూ ఆరోపణలు చేయడం భావ్యం కాదు.
నరేష్ గురించి మాట్లాడాలంటే హైదరాబాదులోనే మాట్లాడొచ్చు కర్ణాటక వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదు.
ఈమె కేవలం నటి పవిత్ర లోకేష్ ను చెడు చేయడానికి అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారని పూజిత వెల్లడించారు.ఇకపోతే తాను నరేష్ ఇంట్లోనే ఉంటున్నానని రమ్య వెల్లడించారు ఈ విషయంలో పూర్తిగా అవాస్తవం ఉందని రమ్య పేర్కొన్నారు.తాను నరేష్ ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన తను తప్పకుండా వెళ్తానని అయితే ఏ ఫంక్షన్ లో కూడా రమ్య అక్కడ కనిపించలేదని కేవలం విజయనిర్మల అమ్మగారు మరణించినప్పుడు మాత్రమే ఆమెను ఆ ఇంట్లో చూశానని పూజిత పేర్కొన్నారు.అలాగే విజయనిర్మల అమ్మ 11వ రోజు కార్యక్రమానికి కూడా రమ్య రాలేదని పేర్కొన్నారు.
ఈ విధంగా నటి పూజిత రమ్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.