ప్రముఖ నటుడు వికే నరేష్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో కలిసి తరచు కనిపిస్తున్న నరేష్ ఆమెని పెళ్లి చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల నరేష్, పవిత్ర లోకేష్ కలిసి మహాబలిపురంలో ఒక దేవాలయాన్ని సందర్శించి ఇద్దరు కలిసి అక్కడ స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు.దీంతో వీరి పెళ్లి గురించి వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.
ఈ విషయం గురించి పవిత్ర ఇటీవల ఒక కన్నడ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో స్పందించింది.మేమిద్దరం ప్రస్తుతం సహజీవనం చేస్తున్నాము మా బంధానికి కృష్ణ గారి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా ఉంది.
మేము ఇప్పుడు కృష్ణ గారితో కలిసి ఫామ్ హౌస్ లో ఉంటున్నాము.మా పెళ్లి గురించి చర్చలు కొనసాగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఈ విషయం గురించి నరేష్ మూడవ భార్య రమ్య కూడా చాలా ఘాటుగా స్పందించింది.అనవసరంగా నామీద ఆర్థిక నేరాలు అంటగట్టి అందరి ముందు నా పరువు తీయాలని చూస్తున్నారు అంటూ నరేష్ మీద మండిపడింది.
రమ్య చేసిన వ్యాఖ్యలపై నరేష్ మొదటిసారి ఈ విషయం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.రమ్య తన గురించి ప్రచారం చేస్తున్న వార్తలకు సమాధానం చెప్పటానికి ఆయన బెంగుళూరు వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
జూన్ 30 వ తేదీన ఈ విషయం గురించి నరేష్ మీడియాతో మాట్లాడాల్సి ఉంది.
కానీ నరేశ్ మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసి రమ్య చేస్తున్న ఆరోపణల పై స్పందించకుండా వెళ్ళిపోయాడు.ఇలా నరేష్ కారులో వెళ్తుండగా మీడియా ప్రతినిధులు నరేశ్ తో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడుతు.
మీతో నేను తప్పకుండా మాట్లాడుతాను.కానీ నాకు ఇప్పుడు వేరే కార్యక్రమం ఉంది.
అందువల్ల ఇక్కడినుండి వెళ్లాల్సి వచ్చింది.త్వరలోనే నేను రమ్య గురించి నిజాలన్ని బయట పెడతాను.
నాకు న్యాయం కావాలి.న్యాయం జరిగే వరకు పోరాడుతాను అంటూ చెప్పి వెళ్ళిపోయారు.
అయితే ఈ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ మలుపు తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.