టాలీవుడ్ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు రోజురోజుకూ హాట్ హాట్ గా మారుతున్నాయి.ఎందుకంటే ఈసారి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురైదుగురు పోటీ పడబోతున్నారు.
ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ మా అధ్యక్ష పదవి కోసం పోటీలోకి దిగారు.దీంతో ఈసారి పోటా పోటీగా ఈసారి ఎలక్షన్స్ జరగనున్నాయి.
ప్రకాష్ రాజ్ కు మెగా కుటుంబం మద్దతు ఇవ్వగా మంచు విష్ణు కు ఘట్టమనేని కాంపౌండ్ కృష్ణం రాజు మద్దతు ప్రకటించారు.అంతేకాదు హేమ, జీవిత కూడా తమ వర్గాల్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.
అందుకే ఇప్పుడు మా ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి.అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నాగబాబు చేసిన వ్యాఖలు హాట్ టాపిక్ అయ్యాయి.
నాలుగేళ్లుగా మా ప్రతిష్ట మసకబారిందని ఆయన చేసిన వ్యాఖ్యలకు సీనియర్ నరేష్ హర్ట్ అయినట్టు తెలుస్తుంది.
ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా నరేశ్ ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియాతో మాట్లాడారు.నాగబాబు చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యానని ఇంతకు ముందు మా కోసం మేము చేసిన పనులకు చిరంజీవి, నాగబాబు ప్రశంసించారని గుర్తు చేసారు.నాగబాబు నాకు మంచి మిత్రుడని నరేష్ తెలిపారు.
అంతేకాదు గత రెండు సంవత్సరాలుగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గురించి ప్రెస్ మీట్ లో వివరించారు.
మేము కథలు చెప్పము కాగితాలతో రావడమే అలవాటు అంటూ నరేశ్ ఎమోషనల్ అయ్యారు.
అంతేకాదు ఎవరిని దూషించడం కోసం ప్రెస్ మీట్ పెట్టలేదని నేను చేసిన పనులను మీడియాతో పంచుకోవడం కోసం ప్రెస్ మీట్ పెట్టానని ఆయన తెలిపాడు.ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నట్టు మూడు నెలల క్రితమే తెలిపాడని లోకల్ నాన్ లోకల్ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదని ఎవ్వరైనా పోటీ చేయవచ్చని తెలిపినట్టు నరేష్ తెలిపారు.
మంచు విష్ణు సినిమాలు తీస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నది నరేష్ తెలిపాడు.ఈసారి ఒక మహిళకు అవకాశం ఇవ్వాలని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అనుకున్నట్టు కూడా తెలిపారు.ఇక్కడ ఎవ్వరు పదవుల కోసం ప్రయత్నించడం లేదని నరేష్ ఘాటుగా స్పందించారు మొత్తానికి ఒకరిపై మరొకరు వ్యాఖ్యలు చేస్తూ మా ఎలెక్షన్స్ ను రసవత్తరంగా మార్చారు.