భారత ప్రధాని నరేంద్ర మోడీ కి యువత లో ఎంత ఫాలో యింగ్ ఉందొ చెప్పనవసరం లేదు.కేవలం ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచదేశాల్లో కూడా ఆయనకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో.
ఎందుకంటే ఆయన ఎంత అద్భుతంగా ప్రసంగాలు ఇస్తారో అంతే అద్భుతంగా యువత ఇన్ స్పైర్ అయ్యేలా పనులు చేసి ఆకట్టుకుంటూ ఉంటారు.తాజాగా ఆయన చేసిన మరో పనికి యావత్ భారతదేశం తో పాటు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
ఇంతకీ మోడీ గారు చేసిన పని ఏంటంటే సముద్ర తీరంలో అరగంటపాటు తిరిగిన మోడీ అక్కడున్న చెత్తను స్వయంగా తీసి ఆయనే శుభ్రం చేశారు.ప్రస్తుతం తమిళనాడు లో పర్యటిస్తున్న మోడీ మామల్ల పురం బీచ్ ను సందర్శించారు.
అక్కడ అరగంటపాటు సంచరించి ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను ఆయన చెత్తో క్లీన్ చేశారు.అరగంటపాటు పర్యటించి అక్కడున్న చెత్తను క్లీన్ చేసినట్లు ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
అక్కడ సేకరించిన చెత్తను హోటల్ సిబ్బందిలో భాగమైన జయరాజ్కు అప్పగించినట్లుగా తెలిపారు.బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్వచ్ఛ భారత్ పేరుతో పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మోడీ కూడా బహిరంగ ప్రదేశాల్లో సైతం ఇలాంటి చర్యలు చేపట్టి అందరికి ఇన్ స్పిరేషన్ ఇస్తున్నారు.మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం.
మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం.అంటూ ట్వీట్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపారు.దీనితో ఆయన ట్వీట్ కు లక్షల్లో లైక్ లు వస్తున్నాయి.మీరు గ్రేట్ సార్ అంటూ నెటిజన్లు ఆయనను ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు.దేశ ప్రధాని హోదా లో ఉండి మోడీ ఇలాంటి పనులు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.