దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఏర్పాట్లు సిద్దం చేస్తున్నాయి.ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నాడు.
ఈ సందర్భంగా టీకా పంపిణీ ఏర్పాట్లు, రాష్ట్రాల పరిస్థితులను అడిగి తెలుసుకొనున్నాడు.భారత్ కరోనా కు రెండు వ్యాక్సిన్ లను తయారు చేసింది.
భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్.ఈ రెండింటికి కూడా భారత ఔషధ నియంత్రణ మండలి నుండి అనుమతి లభించింది.
ఇప్పటికే అన్నీ రాష్ట్రాలల్లో డ్రై రన్ ఏ ఆటంకం లేకుండా సక్సెస్ ఫుల్ గా నిర్వహించాయి.వాటి ఫలితాలు ఆదారంగా టీకా పంపిణీ జరుగుతుంది.దేశంలో ముందుగా మూడు కోట్ల మందికి మొదటగా టీకా ఇవ్వనున్నారు.మొదటి దశలో ఉచితంగా టీకా పంపిణీ జరుగుతుంది.రెండో దశ టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించనున్నది.