ప్రధాని నరేంద్ర మోడీ నేడు మీడియా ముందుకు వచ్చిన సమయంలో తన రుమాలును ముక్కుకు మూతికి పెట్టుకుని కనిపించిన విషయం తెల్సిందే.మాట్లాడే సమయంలో ఆ రుమాలును తొలగించారు.
ప్రతి ఒక్కరు విధిగా ఇంట్లో తయారు చేసిన మాస్క్ను ధరించాలంటూ విజ్ఞప్తి చేశాడు.ప్రతి ఒక్కరు కూడా విధిగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే.
మాస్క్పై మరింత అవగాహణ పెంచేలా తన ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చారు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రదాని నరేంద్ర మోడీని ట్విట్టర్లో ఫాలో అవుతారనే విషయం తెల్సిందే.
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే రాజకీయ నాయకుల్లో అత్యధిక ఫాలోయింగ్ కలిగి ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ట్విట్టర్లో డీపీని మార్చడం చర్చనీయాంశం అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మాస్క్ను ధరించాలనే బలమైన సందేశాన్ని మోడీ ఇస్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది.
ఇది నిజంగా అభినందన నీయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
.