భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాడు.ముఖ్యంగా తన డ్రస్సింగ్ స్టైల్తో అలరిస్తూ ఉంటాడు.
విదేశాలకు వెళ్లినప్పుడు కాస్లీ డ్రస్సులు వేసుకునే మోడీ, దేవాలయాలకు వెళ్లేప్పుడు సాంప్రదాయబద్దమైన డ్రస్లను వేసుకుంటూ ఉంటాడు.తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెన్నై వచ్చిన సమయంలో ఆయనకు పంచె కట్టుతో ఆహ్వానం పలికి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడంతో పాటు, చెన్నై పంచె కట్టు సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు.
ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైన పంచె కట్టును ప్రపంచానికి పరిచయం చేసిన మోడీ తమిళుల మనసు దోచుకున్నాడు.తన మార్క్ చూపించిన మోడీ తమిళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చేశాడు.
తమిళ వ్యక్తిలా కనిపించిన మోడీ జిన్ పింగ్కు తమిళుల పద్దతిలోనే ఆహ్వానం పలకడం కూడా చర్చనీయాంశం అయ్యింది.చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు పక్కన ఉండి మహాబలిపురంలోని అద్బుతమైన ప్రాచీన కట్టడాలను మోడీ చూపించారు.
ఆయనకు ఇంగ్లీష్లో చరిత్రను వివరిస్తూ ఒక గైడ్ మాదిరిగా మారిపోయారు.