2002 సంవత్సరంలో గుజరాత్ అల్లర్లలో మోడీ హస్తం ఉంది అంటూ దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి.పలు ప్రజా సంఘాలు కూడా మోడీని తప్పుబట్టాయి.
మోడీపై మానవ హక్కుల కమీషన్ కేసును నమోదు చేసింది.దాంతో సుప్రీం కోర్టు మరియు కేంద్రంలు పలు కమిటీలు వేసి గుజరాత్ అల్లర్ల కేసును ఎంక్వౌరీ చేయించాయి.
ఆ ఎంక్వౌరీ సుదీర్ఘ కాలం కొనసాగుతూనే ఉంది.ఎట్టకేలకు అంటే 17 ఏళ్ల తర్వాత ఈ కేసు విషయంలో మోడీకి పూర్తి క్లీన్ చీట్ దక్కింది.
నరేంద్ర మోడీ గోద్రా అల్లర్లకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.ఆ క్రమంలోనే మోడీ నేతృత్వంలో ముస్లీంలపై దాడులు జరిగాయి అంటూ ఆరోపణలు వచ్చాయి.2014లో అల్లర్ల పై రిటైర్డ్ జస్టీస్ నానావతి అక్షయ్ ఒక కమిటీ వేయడం జరిగింది.ఆ కమిటీ కొన్ని వందల మందిని ప్రశ్నించిన తర్వాత ఎట్టకేలకు తన తుది రిపోర్ట్ను ఇవ్వడం జరిగింది.
అందులో మోడీకి క్లీన్ చీట్ ఇచ్చారు.