భారతదేశ ప్రధాని నరేంద్ర మోడి 16వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.
స్వతంత్రం వచ్చిన తొలి నాళ్ళలో ప్రజాస్వామ్య మనుగడపై అందరిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయ్యాయని అన్నాడు.
మన దేశంలో తయారు అయిన వస్తువులను ఎక్కువగా ఉపయోగించాలని కోరాడు.ఇలా చెయ్యడం ద్వారా మన చుట్టూ నివసించేవారికి మనం తయారు చేసిన వస్తువులను వాడాలన్న ఆకాంక్షా పెరుగుతుందని అన్నాడు.
బ్రాండ్ ఇండియా ఉద్దీపనలో ప్రవాస భారతీయుల పాత్ర చాలా కీలకంని నరేంద్ర మోడి తెలిపారు.స్వయం సమృద్ది సాదించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని అన్నాడు.ఔషధ రంగంలో భారత్ ఎంతో అభివృద్ది చెందిందని అన్నాడు.నేడు ప్రపంచ వ్యాప్తంగ భారత్ ప్రతిష్ట విస్తరిస్తుందని అన్నాడు.కరోనా కు విరుగుడుగా భారత్ రెండు వ్యాక్సిన్ లను డెవలప్ చేసింది.వాటి కోసం ప్రపంచ దేశాల ఎదురు చూస్తున్నాయని అన్నాడు.
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను భారత్ ఎలా అమలు చేస్తుందనే దానిపై ప్రపంచ దేశాల ప్రజల్లో ఆసక్తి నెలకొన్నదని నరేంద్ర మోడి తెలిపాడు.