కరోనా సమయంలో నేనున్నా అంటూ ముందుకు వచ్చిన సినీ నటుడు విలన్ పాత్రలు పోషించిన సోనుసూద్.కానీ ఇప్పటివరకు చేసిన సహాయం గురించి అందరికీ తెలిసిందే.
అంతేకాకుండా రాజకీయ నాయకుల నుండి వ్యతిరేకమైన విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా అందరూ తన వాళ్లు అనుకుంటూ తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు.ఆపదలో ఉన్న వారిని కాపాడుతూ వస్తున్నాడు.
ఇక సోనూసూద్ ను గౌరవసూచకంగా మెప్పించాలని ఓ వ్యక్తి 2 వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
మహారాష్ట్రలోని వషీమ్ ప్రాంతానికి చెందిన నారాయణ్ కిషన్ లాల్ వ్యాస్ అనే సైక్లిస్ట్ సోనూసూద్ మీద ఉన్న అభిమానంతో అతనిని గౌరవపరిచేందుకు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ విధంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఐదేళ్ల నుండి సామాజిక, జాతీయ సమస్యల మీద ఐదేళ్లుగా సైక్లింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కాబట్టి ఈ సారీ దేశవ్యాప్తంగా హీరోగా మారిన సోనూసూద్ కోసం సైక్లింగ్ కు అంకితమిస్తూ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు రెండు వేల కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేయనున్నట్లు ప్రకటించాడు.
కిషన్ లాల్ వ్యాస్ మహారాష్ట్ర నుంచి రామ సేతు వరకు తన ప్రయాణం పూర్తవుతుందని తెలిపారు.వషీమ్- హైదరాబాద్- బెంగళూరు- మధురై- రామసేతు మార్గాల నుండి రెండు వేల కిలోమీటర్ల వరకు చేయనున్నానని తెలిపాడుతెలిపారు.
ఇక ఈ విషయం గురించి సమాచారం తెలుసుకున్న సోనూసూద్ తన మాటలకు స్పందిస్తూ తనకోసం కిషన్ లాల్ వ్యాస్ చేయాలనుకుంటున్న సైక్లింగ్ రైడ్ లో ఎప్పటికీ పొందలేని అతిపెద్ద పురస్కారం అని ప్రశంసలు కురిపించారు.ఇక ప్రస్తుతం సోనూసూద్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ఈ ఏడాది విడుదల సిద్ధం కానుంది.