లాక్ డౌన్ తర్వాత థియేటర్ల గేట్లు తెరుచుకున్న నేపథ్యంలో వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.చిన్న సినిమాలు అయితే వారంలో మూడు నాలుగు పెద్ద సినిమాలు అయితే ఒకటి రెండు కంటిన్యూస్ గా విడుదల అవుతూనే ఉన్నాయి.
కొన్ని పెద్ద సినిమా లు క్లాష్ అవుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడి ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.నారప్ప సినిమాను మే 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాను మే 13న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఒక్క రోజు గ్యాప్ లో రెండు పెద్ద హీరోల సినిమా లు విడుదల అయితే ఖచ్చితంగా వసూళ్ల పరంగా రెండు సినిమాలకు దెబ్బ పడుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అది బయ్యర్లకు నిర్మాతలకు అందరికి ప్రభావం చూపుతుంది.
అందుకే సినిమా కు సినిమాకు కనీసం అయిదు నుండి వారం రోజుల గ్యాప్ ఉండేలా విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఆచార్య మరియు నారప్ప రెండు సినిమాల్లో మొదటగా నారప్ప సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
ఆ తర్వాత కొన్ని గంటలకు ఆచార్య సినిమా విడుదల తేదీపై ప్రకటన చేశారు.కనుక ఆచార్య సినిమా విడుదల తేదీని మార్చుకుంటే పద్దతిగా గౌరవ ప్రథంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాని ఆచార్య పెద్ద సినిమా కనుక ఇప్పటికే వేరే సినిమా లు విడుదలకు ఇతర తేదీల్లో బిజీ గా ఉన్నాయి కనుక మార్చడం వల్ల చాలా సినిమాలు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే నారప్ప సినిమా విడుదల తేదీని మార్పించేందుకు ఒప్పించినట్లుగా సమాచారం అందుతోంది.నారప్ప సినిమా విడుదల తేదీ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు త్వరలోనే ఒక క్లారిటీ తో కూడిన ప్రకటన చేసే అవకాశం ఉంది.