శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా నారప్ప.ఈ సినిమాను తమిళ సినిమా నుండి రీమేక్ గా రూపొందించారు.
ఇందులో హీరో విక్టరీ వెంకటేష్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, కార్తీక్ రత్నం వంటి పలువురు నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై కలై పులి ఎస్.తను , దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాకు మణిశర్మ తన సంగీతాన్ని అందించాడు.
ఈ సినిమా ఓ అనగారిన కులానికి చెందిన కుటుంబం అగ్రకులంలో ధనికుల భూస్వామి వల్ల ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లను నిలిపివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సినీ బృందం.
దీంతో కొందరు వెంకటేష్ అభిమానులు ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి నిరాకరిస్తున్నారు.తాజాగా మరో అభిమాని కూడా ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నాడు.
ఈ సినిమాను థియేటర్లో తప్ప ఓటీటీ లో విడుదల చేసేందుకు వెంకటేష్ అభిమానులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు.కావాలంటే థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు వేచి ఉండమని కోరుకోగా ఓటీటీ విడుదల మాత్రం వద్దు అని వ్యక్తం చేస్తున్నారు.తాజాగా వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ అనే వెంకటేష్ వీరాభిమాని.నారప్ప సినిమా ను ఓటీటీ లో విడుదల చేయవద్దని నిరాహారదీక్షను చేస్తున్నాడు.
ప్రస్తుతం ఆ వ్యక్తి నారప్ప సినిమాను థియేటర్లో విడుదల చెయ్యాలని ఓ ప్రకటన వేయగా అందులో తన వంతుగా తను ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.దీంతో ఆ వీరాభిమాని తో పాటు మరి కొంత మంది అభిమానులు కూడా థియేటర్ లోనే విడుదల చేయాలని తెగ కామెంట్స్ చేస్తున్నారు.మరి నారప్ప టీమ్ ఈ అభిమాని కోసం ఎలా స్పందిస్తారో చూడాలి.