స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కబోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది.
అయితే కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇక తాజాగా షూటింగ్ లకి మరల పర్మిషన్ ఇవ్వడంతో షెడ్యూల్ ప్లాన్ చేసేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడు.
క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.షూటింగ్ షెడ్యూల్ కూడా వీలైనంత వరకు ఒకే సారి అయిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు.
దానికిగాను ముందే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.షెడ్యూల్ గ్యాప్ ఇస్తే పరిస్థితులు మళ్ళీ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ వెళ్లాలని అనుకుంటున్నారు.
ఇక అల్లు అర్జున్ కూడా షూటింగ్ కి సిద్ధంగా ఉండటంతో వచ్చే నెల పట్టాలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముందుగా విజయ్ సేతుపతిని విలన్ గా అనుకున్నారు.
అయితే అతని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నారు.అయితే తరువాత లాక్ డౌన్ కావడంతో ఇంత వరకు విలన్ పాత్రకి ఎవరిని ఖారారు చేయలేదు.
అయితే ఇప్పుడు షూటింగ్ కి రెడీ అవుతూ ఉండటంతో సుకుమార్ మరల పుష్ప సినిమా కోసం విలన్ వేట మొదలు పెట్టారు.అతని సినిమాలలో హీరోలతో సమానంగా విలన్ పాత్రలు ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు విలన్ పాత్ర కోసం నారావారి అబ్బాయి నారా రోహిత్ ని సుకుమార్ సంప్రదించినట్లు తెలుస్తుంది.కథ కూడా చెప్పడం జరిగిందని, క్యారెక్టర్ నచ్చడంతో అతను చేయడానికి ఒకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది.
ఎప్పుడు కొత్తదనం ఉన్న కథలతో ఎక్కువ ప్రయోగాలు చేసే నారా రోహిత్ కి పుష్ప సినిమాలో విలనిజం బాగా నచ్చేసిందని చెప్పుకుంటున్నారు.అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా చిత్ర యూనిట్ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.