టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోల్లో నారా రోహిత్ కూడా ఒకరు.తనదైన యాక్టింగ్, డైలాగ్ డెలివరితో ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించగల ఈ హీరో ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా ఆయన ఒక సినిమాతో మరో సినిమాకు చూపించే వేరియేషన్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షి్స్తుంది.2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ చిత్రం తరువాత రోహిత్ కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు.
ఇప్పుడు వరుసగా సినిమాలను ఓకే చేస్తూ వాటిని లైన్లో పెట్టే పనిలో పడ్డాడు.కాగా ఆయన ఈ లాక్డౌన్ సమయంలో వరుసగా కథలను వింటూ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఆయన ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథ విన్న నారా రోహిత్, ఈ సినిమా చేసేందుకు సై అన్నాడట.ఇక పూర్తిగా ఎంటర్టైనర్ మూవీగా రానున్న ఈ సినిమాలో రోహిత్ అదిరిపోయే లుక్తో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.
దీనికోసం ఆయన ఇప్పటికే బరువు తగ్గే పనిని కూడా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు రూ.40 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో చిత్ర వర్గాలు షాక్కు గురయ్యాయి.
నారా రోహిత్కు మార్కెట్ అంతగా లేకపోయినా, ఇంతమేర బడ్జెట్ను కేటాయించడం అంటే ఇది ఖచ్చితంగా రిస్క్ అంటున్నారు సినీ క్రిటిక్స్.మరి ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉంటే నారా రోహిత్ అంత బడ్జెట్ను ఓకే చేస్తాడనేది ఈ సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఏదేమైనా నారా రోహిత్ తన సినిమా బడ్జెట్తో మరోసారి వార్తల్లో నిలిచాడు.