నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘వి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ దక్కింది.
ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రంగా ‘టక్ జగదీష్’ను తెరకెక్కిస్తున్నాడు నాని.ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, కరోనా కారణంగా కొంత గ్యాప్ తీసుకుంది.
ఇప్పుడు తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ సక్సెస్ను అందుకునేందుకు నాని రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ప్రెస్టీజియస్ మూవీని తెరకెక్కించేందుకు నాని రెడీ అయ్యాడు.ఈ సినిమాను టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు మరో యంగ్ హీరో నారా రోహిత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో కేమియో తరహా పాత్ర అయినా, ఆ పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువ ఉండటంతో ఈ పాత్రలో నటించేందుకు నారా రోహిత్ను చిత్ర యూనిట్ ఓకే చేయించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక నాని 27వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాను నవంబర్ నెలలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కోల్కతా బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ను హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి నారా రోహిత్ గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకున్న ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందో చూడాలి.