ఏపీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు ఇంకా పొలిటికల్ క్లారిటీ వచ్చినట్టు కనిపించడం లేదు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ ఆ స్థాయిలో మాత్రం పార్టీని ముందుకు నడిపించడంలో వెనుకబడి పోతున్నారు.
కేవలం ట్విట్టర్ ద్వారానే తన భావాలు, విమర్శలు చేస్తూ వ్యక్తం చేస్తూ లోకేష్ ట్విట్టర్ నాయకుడిగా అధికార పార్టీ నాయకుల విమర్శలు ఎదుర్కొంటున్నాడు.ఎన్నికల ముందు వరకు పార్టీలోను, ప్రభుత్వంలోను తన హవా చూపించిన లోకేష్ తీరిక లేకుండా వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేవాడు.
కానీ ఇప్పుడు మాత్రం పార్టీ కార్యక్రమలలోనూ, వైసీపీ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయడంలో పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించ లేక పోతున్నాడు.
ఆయన ఇంకా మంగళగిరిలో తన ఓటమి షాక్ నుంచి బయటపడలేదు అన్నట్టుగానే అర్థం అవుతోంది.గతంలో లోకేష్ హవా చూసుకుంటే ఆ పార్టీ నాయకులు పారిశ్రామికవేత్తలు ఇలా అందరూ లోకేష్ జపం చేసేవారు.ఆయన దృష్టిలో పడితే తమకు మంచి భవిష్యత్ ఉంటుంది అన్నట్టుగా వ్యవహరించేవారు.
పార్టీలో సీనియర్ నాయకులు కూడా లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ, కాబోయే పార్టీ అధ్యక్షుడు, సీఎం అంటూ హడావిడి చేసేవారు.కానీ ఇప్పుడు ఎక్కడ ఆ హడావుడి కనిపించడం లేదు.
అసలు టిడిపిలో లోకేష్ ను పట్టించుకునే వారే అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది.ఎన్నికల తర్వాత లోకేష్ కేవలం తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలలో మాత్రమే పర్యటించారు.ముగ్గురు నలుగురు నాయకులు తప్ప లోకేష్ కు మిగతావారంతా దూరంగానే ఉంటున్నట్టు కనిపిస్తోంది.ఆయనకు పార్టీలో పట్టు పెంచి తాను ఇక విశ్రాంతి తీసుకుందామని చంద్రబాబు ఎదురు చూస్తుంటే లోకేష్ మాత్రం ఇంకా ఓనమాలు దగ్గరే ఆగిపోతుండడం పార్టీ నాయకుల్లోనూ కలవరం పెంచుతోంది.
నిత్యం ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల మీద దృష్టిపెట్టి ముందుకు వెళ్లకపోతే లోకేష్ మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందలేడని స్వయంగా ఆ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు.