వైకాపా తీరుపై తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.గతంలో పలు సార్లు రావాలి సీబీఐ.
కావాలి సీబీఐ అంటూ మొత్తుకున్న వారు ఇప్పుడు సీబీఐని ఎందుకు రానివ్వడం లేదు అంటూ ప్రశ్నించాడు.మీ సొంత బాబాయి వైఎస్ వివేకనంద హత్యకేసులో అసలు విషయాలను తెలుసుకునేందుకు మీరు సీబీఐను ఎందుకు ఆశ్రయించడం లేదు అంటూ నారా లోకేష్ ప్రశ్నించాడు.
ఈ కేసులో నింధుతులుగా ఉన్న వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందనే విషయాన్ని కూడా మీరు వివరించాలంటూ ఈ సందర్బంగా లోకేష్ ట్వీట్స్ చేశాడు.</br>
సీబీఐకి కోడి కత్తి కేసును అప్పగించాలని కూడా నారా లోకేష్ అన్నారు.
గతంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ తెగ హడావుడి చేసిన మనిషి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో చెప్పాలి.ఒకవేళ ఈ కేసులు అన్ని కూడా సీబీఐకి వెళ్తే మీరు ఇక జీవితాంతం శుక్రవారం కోర్టుల చుట్టు తిరగాల్సిందే కదా అంటూ లోకేష్ ఎద్దేవ చేశాడు.
వైకాపా నాయకులు కక్ష పూరితంగా వ్యవహరించకుండా కాస్త పరిపాలన సరిగా నిర్వహించాలంటూ లోకేష్ కోరాడు.ఈ సందర్బంగా లోకేష్ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.