టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై మరోసారి ఆరోపణలు చేశాడు.గత కొన్ని రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో ని ప్రజలు ఓ వింతైన వ్యాది తో బాధ పడుతున్నారు.
ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఆరోగ్యం సేవలు సరిగ్గా అందడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వారికి వైధ్యసేవలు అందించే విషయంలో విఫలం అయిందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయంపై కేంద్ర వైధ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కు ఓ లేఖను రాశాడు.
ఏలూరు లోని పట్టణంలో వింతైన వ్యాధితో ప్రజలు భయాందోళనకు గురి అవ్వుతున్నారు.వైధ్యులు సైతం ఆ జబ్బు ఏమిటి అనే విషయంపై వివరణ ఇవ్వలేకపోతున్నారు.
ఎమర్జెన్సీ ఆరోగ్య పరిస్థితి అక్కడ విదించాలని ఆ లేఖలో నారా లోకేశ్ పేర్కొన్నాడు.