పోలవరం ప్రాజెక్టు టెండర్ లను రద్దు చేస్తూ రివర్స్ టెండర్ కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సైతం పార్లమెంట్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టెండర్లు రద్దు చేయడం వల్ల వ్యయం మరింత పెరుగుతుంది అని,అంతేకాకుండా పోలవరం మరింత ఆలస్యం అవుతుంది అని కేంద్రం చెబుతుంది.అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేత లోకేష్ కూడా జగన్ కు ఒక ఝలక్ ఇచ్చారు.
ఇది తుగ్లక్ చర్య అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు.తుగ్లక్ గారు ఇది విన్నారా? పోలవరం టెండర్ల రద్దు అనేది చాలా బాధాకరం, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చేసిన ప్రతి రూపాయి కి కూడా ఒక లెక్క ఉంది అంటూ ట్వీట్ చేశారు.అలానే మీరు తీసుకున్న ఈ తుగ్లక్ చర్య కారణంగా ప్రాజెక్ట్స్ ఆలస్యం అవ్వడంతో పాటు వ్యయం కూడా ఎక్కువ అవుతుంది అంటూ లోకేష్ ట్వీట్ చేస్తూ మండిపడ్డారు.
మరోపక్క వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగింది అని ఈ కారణంగా టెండర్ల ను క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ల నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుంది.ఏపీ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చ్చినప్పటి నుంచి కూడా అటు టీడీపీ,వైసీపీ ల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తూ ఉంది.