ట్విట్టర్ వేదికగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో బాగా ఆరితేరిపోయారు.ఎప్పుడూ టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెంచేలా ప్రజా సమస్యలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వైసీపీ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
అదేవిధంగా మరోసారి వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మీద విమర్శలు చేశారు.
వైయస్ జగన్ సైకోయిజం పీక్స్ కు చేరింది అంటూ ట్విట్టర్ లో లోకేష్ విమర్శలు చేశారు.
ఆఖరికి ఒంటరి మహిళలను సైతం వైసీపీ నేతలు వదలడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.టిడిపి కార్యకర్తలు ఇళ్ళకి అడ్డంగా గోడలు కట్టడం, ఇప్పుడు ఏకంగా మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారు అంటూ విమర్శలు చేశారు.
ప్రకాశం జిల్లా రెడ్డి పాలెంలో ఆదిలక్ష్మమ్మ ఇంటి ముందు కట్టిన గోడను చూస్తేనే జగన్ కు మహిళల పట్ల ఉన్న గౌరవం ఏంటో అర్థం అవుతుంది అంటూ విమర్శించారు.వైసిపి నాయకులు కట్టిన గోడలతో ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేయగలరేమో కానీ ప్రజల్లో మీ ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరు అంటూ దీనికి సంబంధించిన ఓ పత్రిక క్లిప్ ను లోకేష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.