కడప జిల్లా పొద్దుటూరు మరోసారి ఫ్యాక్షన్ గొడవలతో ఉలిక్కి పడింది.ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు టిడిపికి చెందిన నేత సుబ్బయ్య బలైపోయాడు.
నిన్న పొద్దుటూరులో ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమంలో బాగంగా అందరు చూస్తుండగా నరికి చంపారు.ఈ విషయంపై సుబ్బయ్య భార్య అపరాజిత ఆందోళనకు దిగింది.
నా భర్త చావుకు కారణం అక్కడి ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన బావమరిది బంగారు రెడ్డి మున్సిపల్ కమిషనర్ రాదా అంటూ అపరాజిత ఆందోళనకు చేపట్టింది.
ఈ విషయం తెలుసుకున్న నారా లోకేశ్ పొద్దుటూరు కు చేరుకొని అపరాజితకు మద్దతుగా ఆందోళన దిగాడు.
పెద్ద సంఖ్యలో టిడిపి నేతలు అక్కడికి చేరుకొని నారా లోకేశ్ కు మద్దతుగా నిలిచారు.ఈ విషయం తెలుసుకున్న అక్కడి డిఎస్పి ఆందోళన ఉపసంహరించుకోవాలని నారా లోకేశ్, అపరాజితలను కోరాడు.
ఈ మేరకు సుబ్బయ్య భార్య అపరాజిత, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డి, రాధాల పేర్లను కేస్ లో చేర్చాలని వాంగ్మూలం ఇచ్చింది.సెక్షన్ 161 కింద కేస్ నమోదు చేసుకొని 15 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చూస్తామని డిఎస్పి హామీ ఇచ్చాడు
.